వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేమ్ సీన్!: హైకోర్టులో వైయస్ జగన్‌కు మళ్లీ భంగపాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో స్టాట్యూటరీ బెయిల్ విషయంలో చుక్కెదురయింది. జగన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. జగన్‌కు బెయిల్ ఇవ్వవద్దని, ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) వాదనతో హైకోర్టు ఏకీభవించింది. బెయిల్ పిటిషన్ విచారణార్హం కాదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

వాన్‌పిక్ కేసులో తాము జగన్‌ను అరెస్టు చేశామని సిబిఐ కోర్టులో వాదించింది. తాము జగన్‌ను మే 27న అరెస్టు చేశామని, ఆగస్టు 14వ తేదిన వాన్‌పిక్ కేసులో ఛార్జీషీటు దాఖలు చేశామని చెప్పింది. అలాంటప్పుడు స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌కు జగన్ అర్హుడు కాదని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. అలాగే తాము మిగతా కేసుల్లో కస్టడీ పొడిగింపుకు అతనిని అడగలేదన్నారు. కాబట్టి అతను బెయిల్‌కు అర్హుడు కాదని సిబిఐ తెలిపింది.

దీంతో తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిందని, తనకు బెయిల్ ఇవ్వాలని స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ దరఖాస్తును హైకోర్టు కొట్టి వేసింది. తాము కేసు మెరిట్స్ జోలికి వెళ్లడం లేదని అయితే, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది.

సిబిఐ కోర్టులో స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ విషయంలో చుక్కెదురు కావడంతో జగన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అక్కడ కూడా ఈ రోజు భంగపాటు తప్పలేదు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విషయంలో కూడా సిబిఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురయింది. దీనిపై అతను హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కోర్టు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

English summary
High Court of Andhra Pradesh has rejected give bail to YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X