లవర్స్గా భావించి మాజీ ఎమ్మెల్యే మనవడిపై దాష్టీకం
వారికి చుట్టుపక్కల ఉన్న వారు సపర్యలు చేస్తుండగానే... పోలీసులు వచ్చారు. నవ దంపతులను లవర్స్ అనుకున్న పోలీసులు భర్తను చితకబాదారు. భర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత వారిద్దరు భార్యాభర్తలు అని తెలుసుకున్న పోలీసులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. భర్తను కొత్తపట్నం పోలీసులు కొట్టారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మరోవైపుబైక్పై నుంచి దంపతులు కిందపడిపోయారని, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు చెబుతున్నారు.
ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టూటౌన్ సిఐ శ్రీకాంత్ పరామర్శించారు. దంపతుల నుంచి మౌకిక ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు సిఐ తెలిపారు. తాను అరుస్తుంటే నోరుమూసి మరీ కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు. సరాదాగా బీచ్ కెళ్లి వస్తుంటే పోలీసులు నిర్ధాక్షిణ్యంగా తన తనయుడు పట్టుకొని చావబాదారని బాధితుడి తల్లి వాపోయింది.