అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవర్స్‌గా భావించి మాజీ ఎమ్మెల్యే మనవడిపై దాష్టీకం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prakasam
ఒంగోలు/అనంతపురం: ప్రకాశం జిల్లాలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే మనువడిపై జులం ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే మనవడు అయిన గౌతమ్ తన భార్య లీలావతితో కలిసి ఆదివారం బకింగ్ హోం కెనాల్‌కు విహార యాత్రకు వెళ్లారు. వారిద్దరికి కొత్తగా పెళ్లయింది. విహార యాత్ర తర్వాత ఇద్దరు ద్విచక్ర వాహనం పైన తిరుగుపయనమయ్యారు. వచ్చేటప్పుడు అదుపుతప్పి వాహనం ఓ చోట కిందపడింది. దీంతో భార్య లీలావతి స్పృహతప్పి పోయారు.

వారికి చుట్టుపక్కల ఉన్న వారు సపర్యలు చేస్తుండగానే... పోలీసులు వచ్చారు. నవ దంపతులను లవర్స్ అనుకున్న పోలీసులు భర్తను చితకబాదారు. భర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత వారిద్దరు భార్యాభర్తలు అని తెలుసుకున్న పోలీసులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. భర్తను కొత్తపట్నం పోలీసులు కొట్టారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మరోవైపుబైక్‌పై నుంచి దంపతులు కిందపడిపోయారని, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు చెబుతున్నారు.

ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టూటౌన్ సిఐ శ్రీకాంత్ పరామర్శించారు. దంపతుల నుంచి మౌకిక ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు సిఐ తెలిపారు. తాను అరుస్తుంటే నోరుమూసి మరీ కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు. సరాదాగా బీచ్ కెళ్లి వస్తుంటే పోలీసులు నిర్ధాక్షిణ్యంగా తన తనయుడు పట్టుకొని చావబాదారని బాధితుడి తల్లి వాపోయింది.

English summary
Prakasam district police make lathicharge on a husband, who was gone excursion with his wife on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X