చిక్కుల్లో డిసిఎం ఈశ్వరప్ప: లోకాయుక్త సోదాలు

బి. వినోద్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వరప్ప నివాసంలో సోదాలు నిర్వహించాలని లోకాయుక్త కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అవినీతికి పాల్పడి ఈశ్వరప్ప ఆస్తులు కూడగట్టుకుంటున్నారని ఆ న్యాయవాది ఆరోపించాడు. ఈశ్వరప్ప, ఆయన కుమారుడు కెఇ కంఠేష్, కోడులు శాలినిలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇంటిలో సోదాలు జరిగిన సమయంలో ఈశ్వరప్ప ఉత్తర కర్ణాటక పర్యటనలో ఉన్నారు. లోకాయుక్త పోలీసుల సోదాలను ఆయన అహ్వానించారు. వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. అయితే, అరెస్టు భయంతో ఈశ్వరప్ప, ఆయన కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు.
ఈశ్వరప్పపై తాజాగా అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే, రాజీనామా చేయడానికి ఈశ్వరప్ప నిరాకరిస్తున్నారు. కాంగ్రెసు ఒత్తిడికి తలొగ్గడానికి ఆయన సిద్ధంగా లేరు.












Click it and Unblock the Notifications