బాబుకు మచ్చ తెచ్చినట్లే: బాలయ్యపై నారాయణ

తెలంగాణపై ఈ నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశాన్ని కాంగ్రెసు పార్టీ తేలిగ్గా తీసుకుంటోందని ఆయన విమర్శించారు. అఖిలపక్ష సమావేశానికి ఎందరు వెళ్లినా తెలంగాణపై ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు నుంచి అఖిల పక్ష సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వస్తారా, ఎవరు వస్తారనేది ముఖ్యం కాదని, ఎవరు వచ్చిన కాంగ్రెసు తరఫున ఒకే అభిప్రాయం వెల్లడించాలని ఆయన అన్నారు.
తెలంగాణపై ఒకే అభిప్రాయం చెప్పకపోతే కాంగ్రెసు సంగతి చూసుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం విషయంలో కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేకున్నా తమకు ఉందని ఆయన అన్నారు. సమైక్యవాదులకు కాంగ్రెసు అధిష్టానం మద్దతు ఉందని ఆయన అన్నారు. ఆర్టీసిలో టిఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం శుభసూచకమని ఆయన అన్నారు.
ఢిల్లీ సంఘటనపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. ఆందోళనకారులను ఎన్కౌంటర్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొత్తులుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications