వైయస్ జగన్ పార్టీ ట్రెజరర్ కిరణ్ కుమార్ రెడ్డి మృతి

ఆయన ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా విషమంగా ఉంది. కొద్ది నెలలుగా ఆయన ఆపోలో ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం అకస్మికంగా క్షీణించింది. దీంతో ఆయనను వెంటిలెటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను రెండు రోజుల క్రితం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతిలు పరామర్శించారు.
కిరణ్ కుమార్ రెడ్డిది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దామర మడుగు గ్రామం. ఆయనకు దివంగత వైయస్తో మంచి సాన్నిహిత్యం ఉంది. కిరణ్ మృతదేహానికి వైయస్ విజయమ్మ, వైయస్ భారతి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు నివాళులు అర్పించారు. కిరణ్ మృతిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications