ఆస్పత్రి డ్రైనేజీ పైప్లైన్లో శిశువుల మృతదేహాలు
అబార్షన్లు చేసి మృతశిశువులను డ్రైనేజీలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ప్రభుత్వాస్పత్రిలో గత 15 రోజుల్లో ఏ విధమైన డెలివరీలు జరగలేదని చెబుతున్నారు. ఆస్పత్రిలో అంతకు ముందు కూడా సాధారమైన డెలివరీలు, సిజేరియన్ డెలివరీలు జరిగాయని వైద్యులు చెప్పారు.
ప్రైవేట్ డాక్టర్లే అబార్షన్లు చేసి మృతశిశువులను ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గర్భ నిర్ధారణ చేయించుకుని, ఆడ శిశువులు పుడుతారని భావిస్తే అబార్షన్లు చేయించుకుని ఉంటారని అంటున్నారు. పైగా, ప్రభుత్వాస్పత్రిలో మృతశిశువులను పడేయడానికి ప్రత్యేకమైన గుంత ఉందని, రసాయనాలతో మృతదేహాలను కాల్చి వేసే వెసులుబాటు కూడా ఉంది. అందువల్ల శిశువుల మృతదేహాలు ఆస్పత్రికి సంబంధించినవి కావని అంటున్నారు.
పోలీసులు రంగంలోకి దిగి పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. గత మూడు నెలల కాలంలో ప్రభుత్వాస్పత్రిలో శిశువులు మరణించలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ మృతదేహాల వెనక ఉన్న గుట్టును రట్టు చేయడానికి పోలీసులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.