ప్రియుడిని గెంటేసి గ్యాంగ్రేప్: లవర్ని చంపిన క్లాస్మేట్
విరుదాచలం జిల్లాలో ఈ దారుణం సోమవారం రాత్రి జరిగింది. విరుదాచలం సమీపంలోని గుణమంగళానికి చెందన యువతి మన్నంపాడియంకు చెందిన భాగ్యరాజు అనే యువకుడిని ప్రేమిస్తోంది. సోమవారం సాయంత్రం వారిద్దరు విరుదాచలం సమీపానికి వెళ్లారు. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుండగా.. ఐదుగురు యువకులు అక్కడకు వచ్చారు. భాగ్యరాజుపై దాడి చేసి అతని సెల్ ఫోన్, డబ్బు దోచుకున్నారు.
అతన్ని అక్కడి నుండి గెంటేశారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో యువతి స్పృహ కోల్పోయింది. ఆమెను స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి చేర్చారు. బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. భాగ్యరాజును విచారించి అతడు ఇచ్చిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ముంబయిలో...
21 ఏళ్ల యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముంబయిలో జరిగింది. ఈ ఘటన ముంబయిలోని చేతన కళాశాలలో చోటు చేసుకుంది. నిఖిల్ బంకర్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతను అదే కళాశాలలో చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. మంగళవారం అతను తన ప్రియురాలిని కత్తితో పొడిచి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ కూడా దీనిపై చర్యలు తీసుకుంటామని, మరోసారి ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.