కాంగ్రెసుకు షాక్: వైయస్ జగన్ పార్టీలోకి బాలరాజు

YSR Congress
విశాఖపట్నం: కాంగ్రెసు పార్టీకి విశాఖపట్నం జిల్లాలో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎం. బాలరాజు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. బుధవారం విశాఖపట్నం ఎజెన్సీలోని పాడేరులో జరిగిన జరిగిన బహిరంగ సభలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో 1990ల్లో ఆయన స్టేషనరీ, హార్టీకల్చర్ మంత్రిగా పనిచేశారు.

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సమక్షంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనతో పాటు పాడేరు మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు ఎస్వీవి రమణమూర్తి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు ఇంచార్జీ కుంబా రవిబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు భగత తెగకు చెందినవారు. పాడేరు శాసనసభా నియోజకవర్గం ఆ తెగ జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. మాజీ మంత్రి ఎం మణికుమారి భర్త ఎం వెంకటరాజు సోదరుడు ఆయన. వెంకటరాజు మావోయిస్టులో దాడిలో మరణించారు.

బాలరాజు కాంగ్రెసు నుంచి వెళ్లిపోవడం వల్ల తమకే నష్టం లేదని, బాలరాజు కొన్నేళ్లుగా క్రియాశీలకంగా లేరని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెద్ద యెత్తున ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే బాలరాజును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+