అమెరికాలో ఎన్నారై హత్య: ద్వేషంతో అన్న యువతి
దీనిపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని తెలిపింది. జాలి కూడా లేదన్నది. నేరం రుజువైతే అమెకు 25 ఏళ్ల జైలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27న న్యూయార్క్ సిటీలోని క్వీన్స్ సబ్ వే ప్లాట్ ఫాంపై ఆమె సునందో సేన్ను తోసేసింది. ఆమెను పోలీసులు శనివారం క్వీన్స్ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
ఈ సందర్భంగా ఎరికా కోర్టులో విచిత్రంగా వ్యవహరించంది. ఆమెపై నమోదైన నేరాభియోగాలను ప్రాసిక్యూటర్లు చదివేటప్పుడు ఎరికా నవ్వింది. దీనిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ప్రవర్తించవద్దని సూచించినట్లుగా న్యూయార్క్ డైలీ న్యూస్ కథనంలో పేర్కొంది.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడులు జరిగినప్పటి నుండి తాను ముస్లింలు, హిందువులపై ద్వేషం పెంచుకున్నానని ఆమె చెప్పారు. కాగా సునందో సేన్ అంత్యక్రియలు సోమవారం న్యూయార్క్లో నిర్వహించనున్నారు.