ఓటేశారని ప్రణబ్కి, మతమని సోనియాకు: జగన్పై గాలి
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీని కలిసేందుకు అనుమతించడం శోచనీయమన్నారు. జగన్ తనకు అనుకూలంగా ఓటేశారనే సానుభూతి ఉందేమో అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా జగన్ తన మతానికి చెందిన వాడనే సానుభూతి ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. వైయస్ జగన్ బెయిల్ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అంత తొందరెందుకన్నారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రెండు కలిసి తెలుగుదేశం పార్టీపై కుట్ర పన్నుతున్నాయన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తింపును రద్దు చేయాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు. జగన్ పార్టీ నేతలు రాష్ట్రపతిని భయపెట్టేలా ప్రవర్తించారని విమర్శించారు. అవినీతి మంత్రులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటలీ రాణా సోనియా గాంధీ భారత దేశ సంపదను దోచుకుంటుందని ఆరోపించారు. సోనియా భారత్ సొమ్మును విదేశాలకు తరలిస్తున్నార్ననారు. అవినీతిపరుల కోసం, జైలులో ఉన్న బందిపోట్ల కోసం సంతకాలు సేకరించడం దారుణమన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యక్తం చేశామన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్రమే అని గాలి అన్నారు.