విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు: ఉండవల్లి

నలబై ఏళ్ల కిందట ఇదే సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతమంతా జై ఆంధ్రా అంటూ ప్రత్యేక రాష్టర్ ఉద్యమ తీవ్రత బలంగా ఉన్న విషయాన్ని ఆయన తన ఆహ్వానంలో గుర్తు చేశారు. విద్యార్థులు 170 రోజులు, ఎన్జీవోలు 108 రోజుల పాటు చేసిన సమ్మెలు, హర్తాళ్, రాస్తారోకోలతో నెలల తరబడి ప్రజాజీవనం స్తంభించిపోయిందని ఆయన గుర్తు చేసారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో లాఠీచార్జీలు, అరెస్టులూ పోలీసు కాల్పులు జరగని ఊరంటూ లేదంటే అతిశయోక్తి కాదని ఆయన అన్నారు.
తాను విద్యార్థిగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తాము రెండో తరగతి పౌరులుగా బతకలేమని, 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని యథాతథంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు చేయాలని సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో ఘోషించారని ఆయన అన్నారు.
జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న తాను 32 రోజులు పాటు జైలులో ఉన్నానని ఆయన చెప్పారు. 40 ఏళ్ల కిందట ఉవ్వెత్తిన ఎగసిన జై ఆంధ్ర ఉద్యమం చివరికి ఎలా ముగిసిందని ఆయన అడిగారు. మరుగున పడిపోయిన నాటి కొన్ని చారిత్రక సత్యాలను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 1948లో హైదరాబాద్ రాజ్యం భారత్లో విలీనం, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1973లో జై ఆంధ్ర ఉద్యమం, 2013లోని యదార్థ పరిస్థితులను సమావేశంలో వివరిస్తానని ఆయన చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications