తెలంగాణ: తగ్గిన మల్లాది విష్ణు, ఓట్ల కోసమే: వీరశివా

తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న సంకేతాలు తమకు లేవన్నారు. గతంలో పలుమార్లు ఇది సున్నితమైన అంశమని అధిష్టానం చెప్పిందని, అలాంటప్పుడు విభజిస్తుందని తాము భావించడం లేదన్నారు. అయితే పరిష్కారం దిశగా ఆలోచిస్తుందని మాత్రం తెలుసునన్నారు. సమైక్యాంధ్ర కార్యాచరణ కోసం తాము భేటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే రాజీనామాలు చేసే ఆలోచన తామెవరం చేయలేదన్నారు. రాజీనామాలు చేస్తామని కొందరు చెప్పినప్పటికీ అది వారి వ్యక్తిగతమన్నారు. హైదరాబాదులో సమావేశం నిర్వహించికునే హక్కు తమకుందన్నారు. హైదరాబాద్ అందరికీ చెందిందన్నారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, అలాగే తాము ప్రజల మనోభావాలు కూడా గౌరవిస్తామన్నారు. అలాగే మా ప్రాంత ప్రజల మనోభావాలు కూడా చెప్పుకుంటామన్నారు.
విభజిస్తే శాస్త్రీయంగా...
రాష్ట్రాన్ని విభజించాల్సిన పరిస్థితి వస్తే శాస్త్రీయంగా అది జరగని కమలాపురం ఎమ్మెల్యే వీరశివ రెడ్డి అన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన రాజకీయాలు అని ఆయన ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications