బాబుతో ఎలాంటి విభేదాల్లేవు: అలకవీడిన మోత్కుపల్లి

అయితే పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించకముందే మోత్కుపల్లి అధ్యక్షుడిని కలుసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఆయన అధినేతను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పారు. కాగా బాబు పాదయాత్ర ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది.
బాబుకు వేలాదిగా కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్ వద్ద బాబు పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు సిపిఐ, యుటిఎఫ్, ఎమ్మార్పీఎస్ కూడా బాబుకు ఘన స్వాగతం పలికాయి.
బాబును కలిసిన వారిలో మోత్కుపల్లితో పాటు ఎంపీలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరీలు కూడా ఉన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం జిల్లాలో తొమ్మిది రోజుల పాటు మూడు నియోజకవర్గాలలో సాగింది. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications