హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తరిమేస్తారా? కాదు: జెసి, పొన్నం మధ్య ఆసక్తికర చర్చ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar - JC Diwakar Reddy
హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, అనంతపురం జిల్లా తాడిపత్రి సీనియర్ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి మధ్య శనివారం ఆసక్తికర చర్చ జరిగింది. సిఎల్పీ కార్యాలయంలో ఈ చర్చ జరిగింది. తెలంగాణవాది అయిన పొన్నం, సీమాంధ్ర ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి సిఎల్పీ కార్యాలయంలో ఎదురుపడ్డారు. పొన్నం విలేకరుల సమావేశం ముగించికొని వస్తుండగా చూసిన జెసి... నవాబ్ సాబ్ అంటూ పలకరించారు.

మమ్మల్ని ఇక్కడి నుండి తరిమేస్తారా? అన్నారు. అలా అని ఎవరన్నారని పొన్నం అన్నారు. మీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరిమేస్తానని హెచ్చరిస్తున్నారని జెసి బదులిచ్చారు. దానికి పొన్నం.. మేం ప్రేమాభిమానాలు కురిపిస్తామే కానీ, ద్వేషించమని, తెలంగాణకి అడ్డు వచ్చిన వారి గురించి ప్రస్తావిస్తూ రాజగోపాల్ అలా అన్నట్లుగా ఉన్నారని వివరణ ఇచ్చారు.

తాము ఎవరినీ చంపడాలు, నరకడాలు చేయమని, ఏం లేకపోయినా ప్రేమ అప్యాయత చూపిస్తామన్నారు. తనను నవాబు అంటూ పలకరించడంపై స్పందిస్తూ... తాము నవాబులమేనని, మీరు రాజులైనా, ఆర్థికంగా ఉన్న వారైనా తమ ముందు కుదరదని సరదాగా అన్నారు.

వెనుక వీపుపై నిప్పు పడి కాలిపోతుంటే కూడా తీయరా ఇది అని పక్కవాడితో అంటామే తప్ప దులుపుకోమన్నారు. నవాబులమైనా గ్లోబలైజేషన్ కాలంలో సర్దుబాటు కావడం కోసం పోరాడుతున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ తర్వాత ఇరువురు అలా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.

English summary

 The interesting discussion was going between Former minister JC Diwakar Reddy and Karimnagar MP Ponnam Prabhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X