'నాయక్'లో పేరు వివాదం: బాబ్జీకి వివి వినాయక్ సారీ

రామ్ చరణ్ తేజ, కాజల్, అమలపాల్ నాయకానాయికలుగా డివివి దానయ్య నిర్మాణంలో, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ చిత్రం విజయోత్సవ యాత్రను చిత్ర యూనిట్ చేపట్టింది. విశాఖపట్నంలోని వీమాక్స్లో రామ్ చరణ్ తేజ, వివి వినాయక్ తదితరులు ప్రేక్షకులతో చిత్రం విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి క్షమాపణలు చెప్పారు.
కాగా నాయక్ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రధారికి తన పేరును పోలిన పేరు పెట్టడంపై బాబ్జీ మండిపడ్డారు. ఆయన ఆందోళన కూడా చేశారు. గండికోట బాబ్జీలో ఉన్న ఇంటి పేరును చిత్రంలో తొలగించారు. ఆ తర్వాత కూడా బాబ్జీ ఇంటి పేరును మాత్రమే తొలగించి బాబ్జీ అనేది అలాగే ఉంచారని, దానిపై తాను అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో విలన్ అన్యాయం, అక్రమాలు, భూకబ్జాలు చేయడం సినియే కావచ్చు.
కానీ తన పేరు పేరుతో ఉండడం చాలా అవమానంగా ఉందని అప్పుడు బాబ్జీ అన్నారు. చిత్రం విడుదలైన రోజే తాను ఈ విషయాన్ని దర్శకులు వివి వినాయక్ దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. దానిపై స్పందించిన ఆయన పేరును తొలగిస్తానని చెప్పారని కానీ, కేవలం ఇంటి పేరును మాత్రమే తొలగించారని, బాబ్జీ అనే దానిని అలాగే ఉంచారన్నారు. చిత్రం విడుదలయి వారం రోజులు గడుస్తున్నా తన పేరును పూర్తిగా తొలగించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications