విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబును అడ్డుకోం, పూలతో ఘన స్వాగతం: లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Lagadapati Rajagopal
విజయవాడ: వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కృష్ణా జిల్లాలో తాము అడ్డుకోమని ఆయనకు ఘన స్వాగతం పలుకుతామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం అన్నారు. విజయవాడలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో కైలాపురం వెంకయ్య సమైక్యాంధ్ర జెండాను లగడపాటి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడారు. ఈ నెల 21వ జిల్లాలోకి ప్రవేశిస్తున్న చంద్రబాబును తాము అడ్డుకోమన్నారు. ఆయనకు కనువిప్పు కార్యక్రమంతో ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. బాబుకు పూలతో స్వాగతం పలుకుతామన్నారు. రాష్ట్రానికి పెనుముప్పు ఉంది. కాబట్టే తాము కనువిప్పు యాత్రను చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమైక్యవాద పార్టీలు 270 సీట్లను గెలుచుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇద్దరూ ఒకటే అన్నారు. బాబును తాను కలిసి సమైక్యవాదంపై కనువిప్పు కలిగిస్తానన్నారు. సమైక్యవాదం సీమాంధ్ర ప్రజల గుండెలోతుల్లో ఉందన్నారు. ఇప్పుడు అది కట్టలు తెంచుకుంటుందన్నారు. ఈ సందర్భంగా లగడపాటితో సహా అక్కడున్న వారంతా జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

రాహుల్ సౌమ్యుడు

ఏఐసిసి ఉపాధ్యక్షులుగా ఎన్నికైన రాహుల్ గాంధీ సౌమ్యుడు, మితభాషి, నిగర్వి అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. 2004 నుండి ఇప్పటి వరకు ఆయన రాజకీయాల్లో అనుభవం సాధించారన్నారు. కార్యకర్త నుండి నేతల వరకు అందరినీ ఆయన సమాన దృష్టితో చూస్తారన్నారు. ఫోటోలు దిగినప్పుడు కూడా రాహుల్ అందరితో పాటు నిలుచుంటారని, తనకు ప్రత్యేకత కోరుకోరన్నారు. అందరిలో ఒకడిగా కలిసిపోతారన్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారన్నారు.

English summary

 Vijayawada MP Lagadapati Rajagopal said on Sundaythat they will invited TDP chief Nara Chandrababu Naidu with flowers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X