విఐపిలను వదిలేయండి, స్త్రీల కోసం వాడండి: సుప్రీం
వేలాది మంది సిబ్బందిని న్యాయమూర్తుల భద్రతకు వినియోగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు గురువారంనాడు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ పోలీసుల వాదనను విన్న సుప్రీంకోర్టు - ఈ సిబ్బందిని ఢిల్లీ రోడ్లపై మహిళలకు రక్షణ కల్పించడం వంటి మంచి పనులకు వాడాలని సూచించింది.
వివిఐపిల భద్రతకు పోలీసు ఆఫీసర్లను నియోగించే విషయంైప ఈ నెల 11వ తేదీ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. సోమవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయని పక్షంలో రాష్టాల హోం శాఖ కార్యదర్శలు నేరుగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
తమిళనాడుకు నీరు విడుదల చేయాలి
తమిళనాడులోని సాంబా వరి పంట కోసం 2.44 టిఎంసిల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు లక్షల హెక్టార్ల పంటను కాపాడుకోవడానికి 9 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని తమిళనాడు సుప్రీంకోర్టును కోరింది. మెట్టూరు రిజర్వాయర్ నుంచి కర్ణాటక తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది.