చెప్పండి, నిరూపిస్తాం: షర్మిల, అనిల్ దంపతులపై బిజెపి

"షర్మిల ఆరు కంపెనీల్లో, అనిల్ 11 కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారని ఇదివరకు నేను ఆధారాలతో బయటపెట్టాను. అయినా ఇప్పటివరకు వారిద్దరూ స్పందించలేదు. వైయస్ బతికున్నప్పడు విశ్వసనీయత ఉండాలని చెప్పేవారు. విజయలక్ష్మి బైబిల్ను చేతిలో పట్టుకుని విశ్వసనీయత గురించి మాట్లాడతారు. విశ్వసనీయత గురించి మాట్లాడే మీరు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించి ఎందుకు విశ్వసనీయతను చాటుకోవట్లేదు? అంటే నేను చేసిన ఆరోపణలు వాస్తవాలేనని అంగీకరిస్తున్నారా?" అని ఆయన అన్నారు.
"మీరు చెప్పే విశ్వసనీయత అంతా బూటకమేనా? అసలు వైయస్ కుటుంబానికే విశ్వసనీయత లేదు. దమ్ము, ధైర్యం ఉంటే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి డైరెక్టర్లుగా కొనసాగుతున్నట్లు ప్రకటించండి. లేదంటే కంపెనీలు మీవి కావని చెప్పండి. అలా చెబితే ఆధారాలతో సహా నిరూపించడానికి మా సిద్ధంగా ఉంది'' ఆయన అన్నారు. విశ్వసనీయత లేని షర్మిల ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర పేరిట ప్రజల వద్దకు వెళుతోందని ప్రశ్నించారు.
"అనిల్ను కేవలం మత బోధకుడని మాత్రమే ప్రజలు నమ్ముతున్నారు. నిజానికి ఆయన పెద్ద రాజకీయ నాయకుడు. పెద్ద వ్యాపారి'' అని ప్రభాకర్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం షర్మిల, అనిల్ కుమార్ పెట్టుబడులపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలో తమ పార్టీ గవర్నర్, సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రభాకర్ చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications