హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుళ్ల సూత్రధారి రియాజ్? ఉదయమే హెచ్చరికలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Riyaz Bhatkal
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల వెనుక ఉగ్రవాది రియాజ్ భత్కల్ హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బెంగళూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సిసిబి) పోలీసులు 2012 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో దర్యాప్తు జరిపి 25 మందిపై కేసులు నమోదు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖుల హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు. పలువురు కార్పోరేటర్లను కూడా టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. మరో పదిమంది కోసం గాలింపు కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారిలో 12 మందిపై ఎన్ఐఏ వర్గాలు బుధవారం చార్జిషీటు దాఖలు చేశాయి. దీంతో పాటు కేంద్ర హోం శాఖకు ఒక నోట్ సమర్పించారు. అందులో ప్రధానంగా మూడు అంశాలను పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ క్రమంలో నిందితులు తమ తదుపరి లక్ష్యం హైదరాబాదే అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

ఆర్డీఎక్స్ లాంటి అత్యంత తీవ్రమైన పేలుడు పదార్థాలు ఉపయోగిస్తామని, టిఫిన్ బాక్సులు లేదా రేడియోలు వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని బాంబులు అమరుస్తామని ఉగ్రవాదులు విచారణలో చెప్పినట్లు ఎన్ఐఏ వర్గాలు హోంశాఖకు తెలియజేశాయి. దీని ఆధారంగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం ఉదయమే రాష్ట్ర పోలీసులను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం హెచ్చరించిన సాయంత్రమే పేలుళ్లు జరగటం గమనార్హం.

ఎన్ఐఏకు ఇంకా దొరకని వారిలో కరడుగట్టిన ఉగ్రవాది, కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్ కూడా ఉన్నాడు. హైదరాబాద్ పేలుళ్ల వెనుక ప్రణాళిక రియాజ్‌దేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చార్జిషీట్ దాఖలైన పన్నెండు మంది ఉగ్రవాదులు లష్కరే తాయిబా, హుజి సంస్థలకు చెందినవారు.

English summary
Blasts have taken place at Dilsukhnagar in Hyderabad opposite bus depot. It is said that 22 persons have succumbed to the injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X