ఒరిగిందేమీ లేదు: బడ్జెట్పై పెదవి విరిచిన బాబు

యుపిఎ పాలనలో 1.50 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రణాళిక లేదని విమర్శించారు. అవినీతిని, నల్లధనాన్ని అదుపు చేసేందుకు విధానాలేవీ ప్రకటించలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 60 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆయన అన్నారు.
ఫ్లోరైడ్ నివారణ కోసం కేటాయించిన 1400 కోట్ల రూపాయలు ఒక్క జిల్లాకు కూడా సరిపోవని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన 300 కోట్ల రూపాయలు ఆహార భద్రతకు ఏ మాత్రం సరిపోవని చెప్పారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని చంద్రబాబు విమర్శించారు. సంక్షేమ పథకాలకు కోత పెట్టారని, సబ్సిడీలు దారి మళ్లుతున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి సరైన కేటాయింపులు లేవని ఆయన అన్నారు.
బాబ్లీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని చంద్రబాబు విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చార్జీల పెంపు పేదవారికి పెనుభారంగా మారుతుందని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాడినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఆయన సూచించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications