ఊహించని విధంగా నిరాశ: బడ్జెట్పై సుష్మా స్వరాజ్

చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్ కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనకారిగా ఉందని, సామాన్యులను, ఎస్సీఎస్టీలను విస్మరించిందని బిఎస్పీ నేత మాయావతి అన్నారు. బడ్జెట్ బీహార్ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యంగ్యంగా అన్నారు.
చిదంబరం అతి సాధారణమైన బడ్జెట్ను ప్రతిపాదించారని, బడ్జెట్ లక్ష్యరహితంగా ఉందని, నిరాశాజనకంగా ఉందని లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్లో కొత్త దనం ఏమీ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ వల్ల దేశంలో ఉన్న 80 శాతం మంది ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు.
ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ అంకెల గారడీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. యుపిఎ వైఫల్యం వల్లనే దేశానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో పూర్తిగా వెనకబడి పోయిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి, గ్రామీణ, చేతి వృత్తులవారికి అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఏ విధమైన ప్రయోజనం లేదని ఆయన అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications