జగన్ ప్యాకేజీల పుట్ట, బేరాలకు జైలుకు..: చంద్రబాబు

జగన్ ప్యాకేజీలతో రాజకీయ విలువలు పతనమవుతున్నాయని, పార్టీ మారేందుకు ముందుకొచ్చిన వారికి సూట్కేసుల ద్వారా కోట్లు ముట్టచెబుతున్నారని, ఆ డబ్బులకు ఆశపడే ఫిరాయింపుదారులు చంచల్గూడ జైలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సంబంధం ఉంటోందని ఆయన అన్నారు.
బ్రదర్ అనిల్ను నమ్ముకున్న వారికి ప్రాణాలు మిగిలే పరిస్థితి కూడా లేదని అంటూ చంద్రబాబు కడపలో వీరభద్రారెడ్డి అనుమానస్పద మృతిని పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ ఘనతగా చెప్పుకొంటున్న రైతు రుణమాఫీలో అవినీతి జరిగిందని 'కాగ్' తేల్చిందని గుర్తుచేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఆరాట పడుతున్నానని, నిద్రలో కూడా ప్రజా సమస్యలే గుర్తుకు వస్తున్నాయనిఅన్నారు.
పాదయాత్ర వల్ల తనకు తెలియకుండానే తనలో మార్పు వచ్చిందని, ప్రజలకు ఏమి చేయాలన్న యాక్షన్ ప్లాన్ మైండ్లో రూపుదిద్దుకుంటోందన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తాను బాంబులకే భయపడలేదంటూ 'అలిపిరి' ఘటనను గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications