జగన్ ప్లాన్: బరిలో టిడిపి మాజీ, సీటుపై కెసిఆర్ ధీమా

YS Jagan-K Chandrasekhar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఆదిరెడ్డి అప్పారావు బరిలోకి దిగనున్నారు. బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. ఆదిరెడ్డి అప్పరావు పోటీ చేస్తారని తెలిపింది. అప్పారావు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బ్యాక్ వర్డ్ క్లాస్ నేత. ఆయన సతీమణి వీర రాఘవమ్మ గతంలో టిడిపి తరఫున రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌గా పని చేశారు.

ఆదిరెడ్డి అప్పారావు దివంగత శ్రీకాకుళం జిల్లా నేత కింజారపు ఎర్రన్నాయుడుకు బంధువు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అతని సీనియారిటీతో పాటు రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారనే ఉద్దేశ్యంతో ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. గతంలో టిడిపిలో పని చేసినందున ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. దీంతో తాము లబ్ధి పొందడంతో పాటు టిడిపిని దెబ్బతీయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందనే భావనతో జగన్ పార్టీ ఆయనను నిలిపినట్లుగా చెబుతున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైనార్టీ నేత మహమ్మద్ అలీని మండలి అభ్యర్థిగా ప్రకటించారు. అలీ తెరాస మైనార్టీ వింగ్ చైర్మన్. ఇతను ఈ రోజు తెరాస తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు. మహమ్మద్ అలీ రెండేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఎమ్మెల్యేలను తెరాస సస్పెండ్ చేసి ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకుంది.

జగన్ పార్టీ, తెరాస ఒక్కో ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకోవచ్చుని భావిస్తున్నాయి. క్రాస్ ఓటింగు అందుకు ఉపయోగపడుతుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 21న జరుగనున్నాయి. నామినేషన్‌లు 4వ తేది నుండి ప్రారంభమయ్యాయి. మార్చి 9న ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+