ఔటర్ రింగ్ రోడ్డులో అట్టపెట్టెలో మహిళ మృతదేహం
మహిళ వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఒంటి పైన పోలీసులు గాట్లు ఉన్నట్లుగా గుర్తించారు. తనకు ఓ కొడుకు ఉన్నాడని, తన భర్త ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని ఆమె చేతిలోని లేఖలో పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
సిఐ, ఎస్సై సస్పెన్షన్
వరంగల్ జిల్లాలోని డోర్నకల్ సిఐ, ఎస్సైపై సస్సెన్షన్ వేటు పడింది. వరకట్నం వేధింపుల కేసులో సరైన విచారణ చేపట్టలేదని సిఐ నాగేశ్వర రావు, ఎస్సై అంజన రావును సస్సెన్షన్ చేస్తూ పోలీసుల ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
రైసు మిల్లుపై విజిలెన్స్ దాడి
గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం బ్రహ్మణపల్లిలోని ఓ రైసు మిల్లుపై గురువారం ఉదయం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అకమ్రంగా నిల్వవుంచిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విద్యార్థిని చితకబాదిన టీచర్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదన్నపేటలోని ఓ పాఠశాలలో గురువారం ఉదయం సుప్రిత్ అనే విద్యార్థినని టీచర్ చితకబాదింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
డబ్బు స్వాధీనం
హైదరాబాదులోని కుషాయిగుడలో పోలీసులు కారులో తరలిస్తున్న రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.