'మహా' ఎటిఎస్ డిఎస్పీ ఆత్మహత్య: భార్యాపిల్లల ఎదుటే

జాతీయ మీడియా వార్తల ప్రకారం - బెనర్జీ తన భార్యను, పిల్లలను తీసుకుని రెస్టారెంట్కు మధ్యాహ్నం భోజనానికి వెళ్లారని, అధికారిక వాహనాన్ని తీసుకుని వెళ్లలేదని, ఇంటి వద్దనే ఉండాలని ఆపరేటర్కు, డ్రైవర్కు చెప్పారని, ప్రైవేట్ కారులో హోటల్కు వెళ్లారని అంటున్నారు.
భోజనానికి ఆర్డర్ ఇచ్చారని, అందరూ మాటల్లో మునిగిపోయారని, ఇంతలో సాయంత్రం 3 గంటల ప్రాంతంలో సర్వీస్ రివాల్వర్ తీసి, తలపై రెండు సార్లు కాల్చుకున్నాడని, రక్తమోడుతూ కింద పడిపోయాడని పోలీసులు చెబుతున్నారు. హోటల్ సిబ్బంది, విజిటర్స్ భయాందోళనలతో నివ్వెరపోయారు. వెంటనే ఆయనను థానే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారు.
సంజయ్ బెనర్జీ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు సూసైడ్ నోట్ కూడా లభించలేదు. మహారాష్ట్ర రాష్ట్ర పోలీసు సర్వీసులో ఆయన 1996లో పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ)గా చేరారు. ఆయన మొదటి పోస్టింగ్ నాందేడ్ డివిజనల్ పోలీసు ఆఫీసరుగా జరిగింది. 2012 జూన్ 25వ తేదీన ఆయన ఎటిఎస్లో చేరారు. కౌంటర్ టెర్రర్ పోలీసు ఏజెన్సీలోని డాటా అనాలిసిస్ వింగ్లో పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications