జగన్ కేసులో సిబిఐ ముందుకు వైయస్ భద్రతాధికారి

జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి మరో మాజీ అధికారి కూడా సిబిఐ ఎదుట హాజరయ్యారు. ఎపిఐఐసి మాజ జోనల్ మేనేజర్ దశరథ రామిరెడ్డి నేడు సిబిఐ ముందు హాజరయ్యారు. దశరథ రామిరెడ్డిని సిబిఐ నిన్న కూడా విచారించింది. దాదాపు మూడు గంటల పాటు ఆయనను విచారించింది. ఈ రోజు ఇతనితో పాటు రమేష్ రెడ్డిని విచారిస్తున్నారు. బుధవారం దశరథ రామిరెడ్డితో పాటు పెన్నా సిమెంట్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
ఎమ్మార్-ఎంజిఎఫ్పై సిబిఐ కౌంటర్
మరోవైపు అభియోగాలను కొట్టివేయాలని ఎమ్మార్-ఎంజిఎఫ్ సంస్థ డిశ్చార్జ్ పిటిషన్ వేయడాన్ని సిబిఐ బుధవారం ఆక్షేపించింది. ఎమ్మార్ కుంభకోణంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే కేసులు నమోదు చేశామని స్పష్టం చేసింది. ఎమ్మార్-ఎంజిఎఫ్ ప్రతినిధిగా శ్రవణ్ గుప్తా సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.
ఎపిఐఐసినిఎమ్మార్ సంస్థ మోసం చేసిందని, ఒప్పందాలను తుంగలో తొక్కిందని కోర్టుకు వివరించింది. ఆ సమయంలో ఎపిఐఐసి ఎండిగా ఉన్న ఆచార్య కూడా ఈ మోసాలకు సహకరించినట్లు సిబిఐ తెలిపింది.












Click it and Unblock the Notifications