జైలుకి సంజయ్‌దత్ సిద్ధం: క్షమాభిక్షకు కట్జూ యత్నం

Markandey Katju-Sanjay Dutt
ముంబై: ఓ వైపు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జైలు జీవితానికి సిద్ధపడగా మరోవైపు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ కట్జూ మాత్రం అతని క్షమాభిక్ష కోసం పట్టుబట్టేందుకు సిద్ధమయ్యారు. సంజయ్ దత్‌కు క్షమాభిక్ష పెట్టమని తానే మహారాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తానని కట్జూ మరోసారి చెప్పారు. గురువారం ఆయన మాట్లాడారు. సంజయ్ దత్ క్షమాభిక్ష కోసం తానే నేరుగా గవర్నర్‌ను కలుస్తానని చెప్పారు. సంజయ్ దత్‌తో పాటు జైబున్నీసాకు కూడా క్షమాభిక్ష పెట్టమని కోరనున్నట్లు చెప్పారు.

సంజయ్ దత్‌కు క్షమాభిక్ష పెట్టమని కోరేందుకు రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, సీనియర్ నేత అమర్ సింగ్‌లు గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కట్జూ కూడా తాను గవర్నర్‌ను కలుస్తానని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సంజయ్ దత్ మాత్రం శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. సంజయ్ దత్ ఈ రోజు మాట్లాడుతూ కన్నీరు కూడా పెట్టుకున్నారు.

తాను క్షమాభిక్ష పిటిషన్ వేయడం లేదని బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గురువారం చెప్పారు. సుప్రీం కోర్టులో తాను లొంగిపోతానని చెప్పారు. కోర్టులపై తనకు పూర్తిగా నమ్మకముందని చెప్పారు. తన దేశం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. సంజయ్ దత్ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ కలచివేసింది.

కట్జూ వారం రోజుల క్రితం మాట్లాడుతూ... ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని మహారాష్ట్ర గవర్నర్ కె శంకర నారాయణన్‌కు గురువారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+