హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై ప్రేమతో కాదా?: ఎమ్మెల్యేల జంప్ వెనుక..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-YSR Congress-Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు అధికార కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు వరుస కడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలు వెళ్లడం వేరు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లడం వేరు. టిడిపి నుండి నలుగురైదుగురు మాత్రమే ఇప్పటి వరకు వెళితే అధికార పార్టీ నుండి ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు.

ఇటీవల అవిశ్వాసం తీర్మానం సమయంలో విప్ జారీ చేసినప్పటికీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి వరుసగా ఎమ్మెల్యేలు అటు వైపుకు వెళ్తుండటం కాంగ్రెసు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.

కాంగ్రెసు వరుసగా రెండోసారి అధికారంలో ఉన్నప్పటికీ జగన్ వైపు పలువురు ఎమ్మెల్యేలు క్యూ కట్టడానికి కారణం.. మూడోసారి పార్టీ అధికారంలోకి రాదనే ఉద్దేశ్యంతోనే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందనే పూర్తి నమ్మకం లేకపోవడం వల్లనే అటు వెళ్తున్నారని అధికార పార్టీలో కూడా చర్చ జరుగుతోందట. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి.

1983, 1985లలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1999లో కాంగ్రెసు గెలుపొందింది. ఆ తర్వాత 1994, 1999లలో తిరిగి టిడిపి గెలిచింది. 2004, 2009లలో కాంగ్రెసు గెలిచింది. అప్పుడు ఎన్టీఆర్ హవా, ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వ పటిమ వల్ల టిడిపి గెలిచిందని, ఇప్పుడు టిడిపి, కాంగ్రెసులు కాకుండా ప్రజలు కొత్త పార్టీ వైపు చూస్తున్నారనే అభిప్రాయం జారిపోతున్న ఎమ్మెల్యేలలో ఉందంటున్నారు.

2004లో భారీ సీట్లు సాధించిన కాంగ్రెసు అదే వైయస్ నాయకత్వంలో స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కిందని గుర్తు చేస్తున్నారు. వైయస్ ఉన్నా 2014లో అధికారంలోకి రావడం కష్టంగానే ఉండేదనే భావనలో ఉన్నారట. అయితే, వైయస్ మృతి కారణంగా జగన్ పార్టీకి సానుభూతి పవనాలు వీస్తున్నాయని, జగన్ జైలులో ఉండటం ఆ పార్టీకి మరింత ప్లస్ అవుతుందని, వీటినన్నింటిని బేరీజు వేసుకొనే ఎమ్మెల్యేలు అటు వైపుకు వెళ్తున్నారట.

కాంగ్రెసు పార్టీ మరోసారి అధికారంలోకి రావడమనే విషయాన్ని పక్కన పెడితే అదే పార్టీలో ఉంటే తమ నియోజకర్గంలో తాము గెలిచే అంశంపై కూడా ఎమ్మెల్యేలు విశ్వాసంగా లేరట. జగన్ పార్టీలోకి వెళ్తే జగన్ హవా, సానుభూతి కలిసి వచ్చి గెలుస్తామనే అభిప్రాయంతో ఉన్నారట. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలకు కిరణ్ పైనో లేదా కాంగ్రెసు పైనో వ్యతిరేకమో, జగన్ పైన ప్రేమో లేదని, కేవలం తమ గెలుపు అవకాశాలు అక్కడ ఉన్నందువల్లే వెళుతున్నారని కాంగ్రెసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. వైయస్ పథకాలను కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని ఆరోపిస్తున్న జగన్ పార్టీ కూడా నిరూపించేందుకు సిద్ధంగా లేదని, అయితే పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ స్లోగన్ వారికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారట.

English summary
Congress leaders are worried about the anti-incumbency factor in the forthcoming general elections, since the party has been in power since the last 10 years. Many of them are of the view that their party may not come to power for the third consecutive time because of the anti-incumbency factor, according to a Pradesh Congress Committee leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X