కడప జిల్లా ప్రమాదంలో 8 మంది హైదరాబాదీల మృతి

హైదరాబాదు నుంచి తిరుపతి వెళ్తున్న ఇన్నోవాను సిమెంట్ లోడ్తో కడపకు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇన్నోవాలో ప్రయాణిస్తున్నవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని, వారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారని సమాచారం. ఈ ప్రమాదం నుంచి ఓ చిన్నారి మాత్రం బయటపడినట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
హైదరాబాదులో అగ్నిప్రమాదం
ఇదిలావుంటే, హైదరాబాదులోని కోఠీ ఉస్మానియా వైద్య కళాశాల వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్రిప్రమాదంలో ప్రాణ నష్టమేదీ సంభవించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున దుకాణానికి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఆ మంటలు 18 దుకాణాలకు వ్యాపించాయి.
మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదంతో కోఠీ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. చెప్పులు, స్వెట్టర్లు, పుస్తకాలు తదితర సామాన్లు విక్రయించే దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications