వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీపై మీడియాకు ఎందుకు ఆందోళన: విజయశాంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో తన పోటీపై మీడియా చూపిస్తున్న ఆసక్తిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి వ్యతిరేకించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీచేసే అంశంపై మీడియాకు ఎందుకు ఆందోళన అని ఆమె ప్రశ్నించారు.

శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షు కె. చంద్రశేఖర రావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

విజయశాంతి మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందించారు. ఈ అంశంపై పార్టీ అధినేత కెసిఆర్, తాను మాట్లాడుకుంటామని, తమకు లేని ఆందోళన మీడియాకెందుకని అన్నారు. తానూ విజయశాంతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలిచి తీరుతామని కెసిఆర్ శుక్రవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

మెదక్ సీటు నుంచి కెసిఆర్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో విజయశాంతి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, దీంతో ఆమె అసంతృప్తితో ఉన్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు విజయశాంతి నుంచి దానికి సమాధానం రాబట్టుకోవడానికి ప్రయత్నించారు.

English summary
Telangana Rastra Samithi (TRS) MP Vijayashanthi said that she is talking with K Chandrasekhar regarding the contest in coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X