వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు బద్దలు: రూ. 200 కోట్లకు నిజాం వజ్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nizam's pink diamond smashes records, sells for Rs 200 crore
లండన్: హైదరాబాద్ నిజాంకు చెందిన పింక్ డైమండ్ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ వజ్రానికి 14 ఏళ్ల క్రితం బరోడా యువరాజు పేర ప్రిన్సీ అని నామకరణం చేశారు. 34.65 క్యారట్ల ఆ పింక్ డైమండ్ వేలంలో 40 మిలియన్ డాలర్లకు, అంటే రూ. 200 కోట్లకు అమ్ముడుపోయింది.

క్రిస్టీ వేలం హౌస్‌లో గానీ అమెరికా భూభాగంపై గానీ అంత ధర పలికిన ఆభరణం ఇంత వరకు ఏదీ లేదు. గత రికార్డు 24.3 మిలియన్ డాలర్లు. అప్పుడు విట్టెల్స్‌బాచ్ డైమండ్ 2008 డిసెంబర్‌లో ఆ ధరకు అమ్ముడుపోయింది. పింక్ డైమండ్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరును వెల్లడించడానికి నిరాకరించాడు.

భారతదేశంలోని ప్రాచీన గోల్కొండ గనుల్లో ఈ వజ్రం లభ్యమైందని, ఫోన్ ద్వారా ఓ వ్యక్తి బిడ్డింగులో పాల్గొన్ని దాన్ని కొనుగోలు చేశాడని హౌస్ ఆఫ్ క్రిస్టీస్ వెల్లడించింది. ఈ వజ్రం మొదట్లో హైదరాబాద్ రాచకుటుంబంలో ఉండేది.

నిజాం రాజులు ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఉండేవారు. వారి వద్ద విలువైన వజ్రాలు, ఆభరణాలు ఉండేవి. ఈ వజ్రానికిి హైదరాబాద్ నిజాంలతోనే కాకుండా బరోడా మహారాణి సీతాదేవికి కూడా సంబంధం ఉంది.

English summary
Princie — named after a 14-year-old prince of Baroda, has smashed all records. The spectacular 34.65 carat intense pink diamond that belonged to the Nizam of Hyderabad, has been sold for a whopping $40 million (almost Rs 200 crore).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X