గోదావరిలో యువకుడు గల్లంతు: షిర్డీ రైలులో దోపిడీ

రైలులో దోపిడీ
విశాఖపట్నం-షిరిడి ప్రత్యేక రైలులో దోపిడీ జరిగింది. మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ వద్ద దుండగులు పలు బోగీల్లోకి ప్రవేశించ ప్రయాణీకులకు మారణాయుధాలు చూపించి బెదిరించారు. వారి నుండి భారీగా నగదను, బంగారాన్ని, సెల్ఫోన్లను తీసుకున్నారు. ఇటీవల షిడిడీ బస్సుల్లోను దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
ముగ్గురు ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం రేకొండలో జరిగింది. రాంరెడ్డి, అతడి భార్య సుగుణ, కొడుకు రాజిరెడ్డిలు వ్యవసాయ బావి వద్ద గురువారం రాత్రి గొడవ పడ్డారు. అనంతరం వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని స్థానికులు 108లో కరీంనగర్ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications