చిన్నారిని చంపేసి మూట కట్టి బావిలో పడేశారు

భయపడిన పాప అరవడంతో, కిడ్నాపర్లు ఆమె గొంతునులిమి, తువ్వాలతో నోరు మూసేశారు. దీంతో ఊపిరాడక ఆటోలనే చిన్నారి ప్రాణాలు విడిచింది. పాప చనిపోయిందని గ్రహించిన కిడ్నాపర్లు, మృతదేహాన్ని ఓ గోనెసంచిలో మూటగట్టి మహబూబ్నగర్కు 20 కిలోమీటర్ల దూరంలోని అడ్డాకుల మండలం పొల్కంపల్లి శివారులో పాడుబడిన బావిలో పడేశారు. యాకూబ్ను అనుమానించిన పోలీసులు గురువారం రెండోదఫా విచారించగా అసలు విషయం చెప్పాడు. దీంతో, శ్రియ తల్లిదండ్రులను, యాకూబ్ను తీసుకుని పోలీసులు హుటాహుటిన మృతదేహాన్ని పడేసిన బావివద్దకు వెళ్లి పరిశీలించారు.
నెలరోజుల కిందటే ఆపరేటర్గా చేరిన యాకూబ్, తన స్నేహితుడు, ఆటో నడిపిస్తున్న నసీం, అమీర్లతో కలిసి కుట్రపన్నాడు. రెండురోజుల కిందటే, శ్రీయ చదువుతున్న పాఠశాల, ఇంటి పరిసరాలను పూర్తిగా వివరించాడు. ఆమెను కిడ్నాప్ చేసినందుకు గాను చెరో రెండు లక్షలిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ ఉండని సమయాన్ని ఎంచుకుని, బుధవారం ఉదయం 11.30కి శ్రీయను ఎత్తుకెళ్లారు. ముందుగా వేసుకున్న పథ కం ప్రకారం, జిల్లా కేంద్రం నుంచి బయలుదేరిన ఆటోను క్రిస్టియన్ పల్లి ద్వారా అడ్డాకుల మండలం పోల్కంపల్లికి మళ్లించి, అక్కడ రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిన బావిలో పడేశారు.
అనంతరం కిడ్నాపర్లు, మహబూబ్నగర్కు తిరిగి వచ్చి, 10 లక్షలు ఇవ్వాలం టూ పాప తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. బుధవారమే మూడుసార్లు ఫో న్ చేసిన కిడ్నాపర్లు పోలీసులనూ ముప్పుతిప్పలు పెట్టారు. ఇంట్లోనే ఆపరేటర్గా పనిచేస్తున్న యాకుబ్ను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications