జగన్కు అవన్నీ బాగా తెలుసు: నారాయణ ఎద్దేవా

ముఖ్యమంత్రి నివాస భవనం, సెక్రటేరియెట్కు రహస్య మార్గాల్లో ఎలా వెళ్లవచ్చో, దొడ్డిదారిన పారిశ్రామికవేత్తలను ఎలా కలుసుకోవచ్చో ప్రజలను, ప్రభుత్వాన్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని ఎలా లూటీ చేయవచ్చో ఆయనకు బాగా తెలుసునని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులు పదవులకు రాజీనామా చేసి తమ నిర్దోషిత్వం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్ ఆస్తుల కేసులో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి నిందితురాలిగా ఉన్నారని, హోం మంత్రి పదవిలో కోనసాగడంపై ఆమె పునరాలోచించుకోవాలన్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న సబిత దగ్గర ఆత్మవంచన చేసుకొని డిజిపి దినేష్ రెడ్డి సెల్యూట్ చేస్తూ ఎలా పని చేయగలుగుతారని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను సిపిఐ వ్యతిరేకించిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, అలాగని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని సవాల్ విసిరారు. ఏనాడూ సబ్ప్లాన్ను వ్యతిరేకించలేదని, కావాలంటే వెంకటేశ్వర స్వామి వద్దనైనా, బహిరంగ సభల్లోనైనా, ఇంకెక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చెప్పారు.












Click it and Unblock the Notifications