నో పాలిటిక్స్ ప్లీజ్! నాన్న చూసుకుంటారు: నారా లోకేష్

ఈ సందర్భంగా పలువురు పార్టీ వ్యవహరాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా లోకేష్ ఆ అవకాశం ఇవ్వలేదు. తాను డెయిరీ పనిగా వచ్చానని, ఇప్పుడు రాజకీయాలు వద్దని, తన తండ్రి పాదయాత్ర కూడా ముగుస్తోందని, ఇక ఆయన ఫ్రీగా ఉంటారని, ఆయనే చూసుకుంటారని నాయకులకు చెప్పారు.
ఆయన్ను కలిసిన వారిలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మ తదితరులు ఉన్నారు. ఆయన పీలేరు పర్యటనను ముగించికొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
కాగా, ఇటీవల నారా లోకేష్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాలలో తిరిగి పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చలు జరిపారు. అయితే, గురువారం ఆయన కంపెనీ పని మీద వచ్చిన కారణంగా రాజకీయ చర్చలకు తిరస్కరించారు.












Click it and Unblock the Notifications