బాలిక రేప్పై నిరసన: మహిళ కొట్టిన పోలీసాఫీసర్

కాంగ్రెసు నేతలు సందీప్ దీక్షిత్, ఎకె వాలియా బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆస్పత్రి వద్ద తీవ్ర నిరసన వ్యక్తమైంది. శుక్రవారం ఉదయం నుంచి ఆర్వింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిరసనల సందర్భంగా ఓ పోలీసాఫీసర్ మహిళపై చేసుకున్న సంఘటన చిత్రం బయటకు వచ్చింది.
బాలికను ఏప్రిల్ 15వ తేదీన అపహరించి, ఆహారం, మంచినీళ్లు ఇవ్వకుండా దుండగుడు ఫ్లాట్లో బందీగా ఉంచి కిరాతకచర్యకు పాల్పడ్డాడు. 30 ఏళ్ల వయస్సు గల ఆ దుర్మార్గుడు తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్లో బాలిక కుటుంబం ఉంటున్న అపార్టుమెంటులోనే ఉంటున్నాడు. అతను బాలికను బందీ చేసి రెండు రోజుల పాటు కిరాకతమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఆమెను రక్షించారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వెలుపల నిరసన ప్రదర్శనకు దిగారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కేసును మాయ చేయాలనే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. తమ కూతురు అదృశ్యంపై ఫిర్యాదు చేస్తే కూడా పోలీసులు తీసుకోలేదని బాలిక తండ్రి చెప్పాడు.












Click it and Unblock the Notifications