తెరాసకు లగడపాటి రిప్లై: ఆంధ్రపై కక్ష: టిజి వెంకటేష్

రాష్ట్రాన్ని దోచుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుటుంబమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఖనిజ సంపద గురించి మాట్లాడే హక్కు కెసిఆర్కు లేదని ఆయన అన్నారు.
తెరాస నేతలకు ఉన్నది తెలంగాణపై ప్రేమ లేదని, ఆంధ్రావారిపై కక్ష ఉందని మంత్రి టిజి వెంకటేష్ ఆరోపించారు. శనివారం ఉదయం గుంటూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు నిర్మించి ఆంధ్రప్రదేశ్కు నీరు రాకుండా చేస్తే తెరాస నేతలు నోరు మెదపలేదని, అయితే, బయ్యారం గనులపై రాద్ధాంతం చేస్తున్నారని, ఇది సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనులను కేటాయించడంలో తప్పు లేదని ఆయన అన్నారు. తెలుగు మాట్లాడే ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం గనులు కేటాయిస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
బయ్యారం గనులపై తెలుగుదేశం, తెరాస రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. అందుకే బయ్యారం గనులను తెలంగాణతో ముడిపెట్టి రాజకీయం చేస్తున్నాయని ఆయన శనివారం విమర్శించారు. అధికారుల అక్రమ గనుల తవ్వకంపై ఆ రెండు పార్టీల నాయకులు ఎందుకు స్పందించరని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications