వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీడపురుగులున్నారు: కడియంపై మోత్కుపల్లి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadiam and Mothkupalli
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుల మధ్య విభేదాలు మరోసారి ముదిరినట్లు కనిపిస్తున్నాయి. పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు కడియం శ్రీహరిపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నేత మోత్కుపల్లి నర్సింహులు పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన పార్టీ తెలంగాణ ఫోరం సమావేశంలోని విషయాలు మీడియాలో రావడంపై మోత్కుపల్లి కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

పార్టీ సమావేశం వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం ఎవరికి ఉందో, వారి గురించి అందరికీ తెలుసునని, అటువంటివారు పార్టీ నుంచి వెళ్లిపోతే మంచిదని, వారు వెళ్లిపోయినా పార్టీకి ఏ విధమైన నష్టం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమావేశం అంతర్గత విషయాలను బయటకు చెప్పడం దిగజారుడుతనమని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీకి కడియం శ్రీహరి సేవలు అందించారని, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడని ఆయన అన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లుగానే తమ పార్టీలోనూ చీడపురుగులున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటూనే పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారు తమ పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. వ్యక్తిగత సమస్యలను పార్టీకి రుద్దడం సరి కాదని ఆయన అన్నారు.

పార్టీలో అనేక సమస్యలుంటాయని, వాటిని బహిర్గతం చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు పాదయాత్ర తర్వాత తెలంగాణలో పార్టీ పుంజుకుందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబు చెవులు కొరికేవారి మాటలే వింటున్నారని, పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి తిరిగి వచ్చినవారికి పెద్ద పీట వేస్తున్నారని కడియం శ్రీహరి శుక్రవారంనాటి తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమావేశంలో అన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
The Telugudesam Telangana region MLA Mothkupapalli Narsimhulu has lashed out at Warangal district party leader Kadiyam Srihari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X