కారు బోల్తా: తెరాస ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

ఎదురుగా దుప్పి రావడంతో ఇది జరిగింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు మినహా ఎవరికీ ఏమీ కాలేదు. ఎమ్మెల్యేతో సహా తొమ్మిది మంది ఈ కారులో ప్రయాణిస్తున్నారు. వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సింహాద్రి అప్పన్నను దర్సించుకున్న బాలయ్య, చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హీరో నందమూరి బాలకృష్ణలు కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలోని ప్రముఖ సింహాద్రి అప్పన్న స్వామి వారిని దర్సించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు.
ఆనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహగిరి పైనే చంద్రబాబు మధ్యాహ్నం భోజనం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం చంద్రబాబు తిరిగి హైదరాబాదుకు బయలుదేరుతారు. చంద్రబాబు రాక కోసం రాష్ట్ర రాజధానిలో కార్యకర్తలు, నాయకులు ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications