బాబునే వైయస్ ఫాలో అయ్యారు!: సిఎంకు విజయమ్మ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరులోనే శ్రామికులను చేర్చామన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇరవై లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కరెంట్ కోతలతో ఫ్యాక్టరీలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైయస్ పాలన సాగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుతాయని ఆమె హామీ ఇచ్చారు.
చంద్రబాబు తన హయాంలో ఏ ప్రాతిపదిన భూములు కేటాయించారో వైయస్ అలాగే కేటాయించారన్నారు. అలాంటప్పుడు ఆరోపణలు కేవలం వైయస్ పైనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఇసూజీ కార్ల కంపెనీకి ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం రాయితీ కల్పించిందో చెప్పాలన్నారు. 130 శాతం రాయితీ ఇవ్వడం వెనుక క్విడ్ ప్రోకో జరిగిందా చెప్పాలన్నారు. వైయస్ పథకాలకు పేర్లు మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రయివేటీకరణ అంటే చాలా ఇష్టమన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను ఆయన తన హయాంలో దివాళా తీయించారన్నారు. తెలుగు తమ్ముళ్లకు ప్రయివేటు సంస్థలను అప్పగించారని మండిపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications