బాబునే వైయస్ ఫాలో అయ్యారు!: సిఎంకు విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరులోనే శ్రామికులను చేర్చామన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇరవై లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కరెంట్ కోతలతో ఫ్యాక్టరీలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైయస్ పాలన సాగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుతాయని ఆమె హామీ ఇచ్చారు.
చంద్రబాబు తన హయాంలో ఏ ప్రాతిపదిన భూములు కేటాయించారో వైయస్ అలాగే కేటాయించారన్నారు. అలాంటప్పుడు ఆరోపణలు కేవలం వైయస్ పైనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఇసూజీ కార్ల కంపెనీకి ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం రాయితీ కల్పించిందో చెప్పాలన్నారు. 130 శాతం రాయితీ ఇవ్వడం వెనుక క్విడ్ ప్రోకో జరిగిందా చెప్పాలన్నారు. వైయస్ పథకాలకు పేర్లు మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రయివేటీకరణ అంటే చాలా ఇష్టమన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను ఆయన తన హయాంలో దివాళా తీయించారన్నారు. తెలుగు తమ్ముళ్లకు ప్రయివేటు సంస్థలను అప్పగించారని మండిపడ్డారు.