వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ దయ!: కర్నాటక ఎన్నికలు తర్వాత ఢిల్లీకి కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో నాలుగైదు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ నెల 5వ తేదిన కర్నాటక శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. 8వ తేదిన ఫలితాలు వస్తాయి. కర్నాటక ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వచ్చే లోపే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలువాలనే భావనతో కిరణ్ ఉన్నారట.

ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయడం, పథకాలపై చర్చించడం వంటి పలు అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించాలని ఎప్పటి నుండో చూస్తున్నారని సమాచారం. ప్రధానంగా మంత్రివర్గ మార్పు కోసం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి కోసం ఆయన చూస్తున్నారు.

ఇటీవల మంత్రివర్గంలో మార్పులు చేర్పుల కోసం అనుమతివ్వాలని సోనియా గాంధీని కలవాలని భావించారు. అయితే అప్పుడు కర్నాటక ఎన్నికల హడావుడిలో ఉన్న సోనియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు ఆసక్తి చూపించలేదు. కర్నాటక ఎన్నికలు పూర్తయ్యాక రావాలని కిరణ్‌కు సూచించింది.

దీంతో కన్నడనాట ఎన్నికలు పూర్తి కాగానే ఈ నెల ఆరున లేదా ఏడో తేదిన కిరణ్ ఢిల్లీ వెళ్లి అధినేత్రిని కలవాలని చూస్తున్నారు. మంత్రివర్గంలో తనకు అనుకూలురైన వారిని తీసుకుని, వ్యతిరేకులను పక్కన పెట్టాలని ఆయన భావిస్తున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి నేతలను ఆయన డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి.

English summary
AP chief minister Kiran Kumar Reddy is planning to visit New Delhi around May 6 before Karnataka elections results are announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X