లెక్కింపు: పూజాగాంధీ, యడ్డీ ఆధిక్యం, బిజెపికి షాక్
ఆధిక్యంలో కాంగ్రెస్
కాంగ్రెసు స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు వెళ్తోంది. కాంగ్రెసు 12 స్థానాల్లో, బిజెపి 5 స్థానాల్లో, జెడిఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివకాపురి నియోజకవర్గంలో కెజెపి అధినేత యడ్యూరప్ప ఆధిక్యంలో ఉండగా, బళ్లారి రూరల్లో బిఎస్సార్ అభ్యర్థి శ్రీరాములు ఆధిక్యంలో ఉన్నారు. వరుణ నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి సిద్దిరామయ్య అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
కాగా, ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెసు పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. బిజెపికి యాభై శాతం సీట్లు తగ్గనున్నాయని సర్వేలు తెలిపాయి. ఇవి కర్ణాటక 14వ శాసనసభ ఎన్నికలు. కౌంటింగ్ ప్రారంభమైన 3 గంటలలోపు అంటే 11 గంటలలోపు తొలి ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.
కాంగ్రెసు అధికారంలోకి వస్తుదని సర్వేలు చెప్పడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. దీంతో, కర్ణాటక తదుపరి సిఎం ఎవరనే అంశంపైనా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు, అన్ని పార్టీలకూ ఈ ఎన్నికలు దిశానిర్దేశం చేయనున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికలకు దిక్సూచిగా కాంగ్రెస్ భావిస్తోంది.
ఇక్కడ మంచి ఫలితాలు వస్తే ముందస్తుకు వెళ్లాలనే యోచనలో ఉందన్న కథనాలు ఇప్పటికే వస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో విజయం సాధిస్తే మొత్తం దక్షిణాదిలో మంచి మార్పు వస్తుందని కూడా ఆశిస్తోంది. ఇక, బిజెపి గెలిస్తే దక్షిణాదిలో పట్టును నిలబెట్టుకున్నట్లు అవుతుంది. కాంగ్రెస్ వ్యతిరేక గాలి స్పష్టమవుతుంది. జెడిఎస్ ఏమాత్రం వెనకబడినా మరో ఐదేళ్లపాటు ఉనికి కోల్పోనుంది.
ఇక రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కెజెపి తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంది. ఇక్కడ ఏమాత్రం వెనకబడ్డా మరో పార్టీలో విలీనం కావడం మినహా ప్రత్యామ్నాయమే లేకుండాపోతుంది. అన్ని పార్టీలకూ ఈ ఎన్నికలు కీలకం కావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెట్టింగ్లూ తీవ్రమయ్యాయి.