ఏ తల్లికీ ఈ కష్టం రాకూడదు: ఏడ్చేసిన శ్రీశాంత్ తల్లి

తమ కుమారుడు ఈ విధమైన తప్పు చేస్తాడని అనుకోవడం లేదని, మైదానంలో అతిగా ప్రవర్తించి ఉండవచ్చునని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాము ఎవరినీ నిందించదలుచుకోలేదని శ్రీశాంత్ తల్లి సావిత్రీదేవి అంటూ కంటతడి పెట్టుకున్నారు. తన తల్లికీ తనకు వచ్చిన కష్టం రాకూడదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
తన కుమారుడి కెరీర్ను నాశనం చేయడానికి ఏదైనా పెద్ద శక్తి పని చేసి ఉండవచ్చునని శ్రీశాంత్ తండ్రి శాంతకుమారన్ నాయర్ అన్నారు. నిన్న ఏం జరిగిందో చూడండి, బెయిల్ పొందడానికి అన్నీ పూర్తయ్యాయని, అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు కొత్త సెక్షన్లతో ముందుకు వచ్చారని ఆయన అన్నారు. ప్రతిదీ మిస్టరీగానే కనిపిస్తోందని ఆయన అన్నారు.
శ్రీశాంత్పై ఢిల్లీ పోలీసులు మోకాను ప్రయోగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపియల్ ఆడిన శ్రీశాంత్ను స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీసులు గత నెల 16వ తేదీన అరెస్టు చేశారు. శ్రీశాంత్కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications