రెండు రాష్ట్రాల్లో 2014 ఎన్నికలు, సిఎం పదవొద్దు: జానా
మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. బంగారు తల్లి పథకం పైన మంత్రివర్గంలో చర్చిస్తామని అన్నారు. తాను తెలంగాణ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అధిష్టానం తల్చుకుంటే తెలంగాణపై ఏకాభిప్రాయం సాధ్యమేనన్నారు. ఏకాభిప్రాయం రాకున్న విచక్షణాధికారంతో ఇవ్వవచ్చునని చెప్పారు.
15లోపు ఎన్నికల సంఘానికి
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వివరాలను ఈ నెల 12వతేది నుంచి 15వ తేదిలోపు ఎన్నికల సంఘానికి ఇస్తామని జానారెడ్డి చెప్పారు.
సిఎంకు వ్యతిరేకంగా ఎవరు లేరు: దానం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మంత్రివర్గంలో ఎవరు లేరని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రిని చేసింది కిరణే అని చెప్పారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ పైన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు.
ఆజాద్ వల్లే అతను శాసనమండలి సభ్యుడు అయ్యారని, అది గుర్తుంచుకోవాలని సూచించారు. మంత్రివర్గం నుండి డిఎల్ రవీంద్రా రెడ్డి తొలగింపు తమ పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే జరిగిందన్నారు.