చెల్లెలి కూతురిని బావిలో పడేసి చంపేసిన అక్క

ధనలక్ష్మి ఆస్తి కోసం ఆశపడి రాజేశ్వరి ఆ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఒక్కగానొక్క కూతురు పోతే చెల్లెలి ఆస్తి తనకు వస్తుందని ఆశపడి రాజేశ్వరి ఏడాది వయస్సున్న చిన్నారిని పొట్టన పెట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెక్ డ్యాంలో పడి ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో చెక్ డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థులు మరణించారు. సైకిల్ కడిగేందుకు వారు చెక్ డ్యాంలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. కృష్ణ చైతన్య (14), పృథ్వీలుగా వారిని గుర్తించారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కృష్ణా జిల్లా జి.కొండూరుకు చెందిన మారీష్ రావును ఓ దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్కు తీసుకుని వచ్చారు. అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, ఫిట్స్ వచ్చి అతను మరణించినట్లు పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లనే మరణించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications