జగన్ ఖుషీ: హరికృష్ణ కొత్త పార్టీ, జూ. ఎన్టీఆర్ ప్రచారం?

రాజకీయ పార్టీని స్థాపించడమా, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఆశయాలకు తిలోదకాలకు ఇచ్చిందని ప్రచారం చేయడమా అనే విషయంలో ఆయన తర్జన భర్జనలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పార్టీ మహానాడుకు మొదటి రోజు వెళ్లిన హరికృష్ణ తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోవడానికి నిరాకరించారు. రెండో రోజు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు.
మహానాడులో వ్యవహరించిన తీరే హరికృష్ణ చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడినట్లు తెలియజేస్తోందని అంటున్నారు. హరికృష్ణను పట్టించుకోకూడదనే వ్యూహంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. అయితే, మౌనంగా ఉండడానికి హరికృష్ణ సిద్ధంగా లేరని అంటున్నారు. కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లే అలోచన ఆయన చేస్తున్నారని అంటున్నారు. గతంలో ఆయన అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే, అది అంతగా ఫలితం సాధించలేదు.
పార్టీ పెడితే ప్రచారానికి తన కుమారుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ను కూడా దింపాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ స్థాపించడం కుదరకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచన కూడా ఆయన చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎన్టీ రామారావు అభిమానుల కోసం ఆయన ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై తన శ్రేయోభిలాషులతో, సన్నిహితులతో హరికృష్ణ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు కొలిక్కి వస్తే పార్టీ పెట్టడమో, పార్టీ పెట్టకుండా ప్రజల వద్దకు వెళ్లడమో నిర్ణయమవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications