దాడి చేయాలని విజయమ్మ చెప్పారు: రాజేష్ సంచలనం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "విజయమ్మ గారు మాకు చెప్పిన విషయం ఒకటుంది. జైలులో జగన్మోహన్ రెడ్డి మద్యం సేవిస్తున్నట్టు.. నీలి చిత్రాలు చూస్తున్నట్టు టిడిపి విమర్శిస్తోంది. సాధ్యం కాని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టిడిపి క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఆ విధంగా మాట్లాడుతోంది. కాబట్టి అటువంటి వ్యాఖ్యలను ఖండించడంతో పాటు అవసరమైతే ఈ వ్యాఖ్యలు చేసే వారిపై భౌతిక దాడులకు దిగడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని కూడా విజయమ్మ గారు చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఉండే కార్యకర్తలందరికీ ఈ విషయం చెప్పమని విజయమ్మగారు చెప్పడం జరిగింది'' అని రాజేష్ చెప్పినట్లుగా దినపత్రికలో వచ్చింది.
అతి త్వరలో జగన్ జైలు నుంచి రాబోతున్నట్లు కూడా విజయమ్మ చెప్పారన్నారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఆయన బయటికొచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయన్నారు. పార్టీని విమర్శిస్తూ ప్రెస్లో మాట్లాడే నాయకులు మళ్లీ వైయస్సార్ కాంగ్రెసు పెద్దలకు ఫోన్ చేసి నెల రోజుల్లో పార్టీలోకి వచ్చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రెస్మీట్లు పెట్టి మరీ ఖండనలను గుప్పించాలని కూడా విజయమ్మ స్వయంగా చెప్పారని వెల్లడించారు. "ప్రతిరోజూ పేపర్లలో ఖండనలు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారని, సాధారణంగా ఎవరు ప్రెస్మీట్ పెట్టినా, మన నాయకులను విమర్శించినా వెంటనే మనం స్పందించడం లేదని అంటున్నారని, నేతలు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ తరపున ఖండనలు ఇవ్వాలని, మనం టార్గెట్ చేసేది కాంగ్రెస్, టిడిపిలనే అని చెప్పారు. ఆ పార్టీల నాయకులను టార్గెట్ చేసి ప్రెస్మీట్లు పెట్టాలని తనతో చెప్పడం వలనే ఈ విషయం చెబుతున్నానని రాజేష్ అన్నారు.
మద్దాల రాజేష్ అలా అని ఉండడని భావిస్తున్నానని, అలా అంటే మాత్రం ఆయన మాటలను తాను ఖండిస్తున్నానని అంబటి రాంబాబు చెప్పారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications