టిడిపి వైఖరి చూస్తుంటే గుండె మండుతోంది: యెన్నం

పోలీసులను ముఖ్యమంత్రి నియంత్రించక పోవడం దురదృష్టకరమని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా అన్నారు. తాము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లేదంటే ఏం జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు అందరు ఇందిరా పార్కు వద్దకు రావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.
పోలీసులు అరెస్టు చేసిన పక్షంలో అడ్డుకున్న చోటునే నిరసనకు దిగాలన్నారు. మంత్రులు చలో అసెంబ్లీకి అనుమతిని ఇప్పించాలన్నారు. తమను అసెంబ్లీకి రానివ్వకుంటే మంత్రులను గ్రామాలకు రానిచ్చే ప్రసక్తి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని గ్రామాలకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలమని చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టులపై ఎందుకు స్పందించడం లేదన్నారు.
శుక్రవారం ఇందిరా పార్కు నుండి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా అక్రమ అరెస్టులు దారుణమన్నారు. శాంతియుతంగానే ఆందోళన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరువేలకు పైబడి బైండోవర్ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను ప్రభుత్వం సృష్టించి భయాందోళనకు గురి చేస్తోందన్నారు. పోలీసుల నియంతృత్వాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications