జమ్మూ ప్రమాదంలో ఆంధ్ర ఐఎఎస్ దంపతుల మృతి

AP IAS officers couple die in road accident
విశాఖపట్నం: జమ్ము కాశ్మీర్‌లోని లేహ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి, ఆయన భార్య మరణించారు. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన పలువురు ఐఎఎస్ అధికారులు మరణించగా, వీరిలో మన రాష్ట్రానికి చెందిన ఒక ఐఎఎస్ అధికారి టి. ధర్మారావు, ఆయన భార్య కూడా ఉన్నారు.

విహార యాత్రలో ఉన్న వీరు జమ్ములోని ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఒక వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ వాహనంలోని వారంతా మరణించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఎఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ధర్మారావు ఇద్దరు కుమారులు వేరే కారులో ఉండటంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ధర్మారావు 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. చాలా కాలంగా మధ్యప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.

పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన ధర్మారావు ఆంధ్రా యూనివర్శిటీలో బిటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐఎం చేసి, సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారిగా పనిచేస్తున్న ధర్మారావు అదే రాష్ట్రానికి చెందిన విద్యారావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా అక్కడే మధ్య ప్రదేశ్‌లోనే ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నారు.

ధర్మారావు దంపతుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో శుక్రవారం విశాఖ నగరానికి తరలించనున్నారు. శనివారం అంత్యక్రియలు జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+