వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తులు ఇద్దరి చేతుల్లోనే: కన్నబాబు, బాబు పైనా ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kannababu
హైదరాబాద్: కాంగ్రెసు పార్ట ఆశయాలకు భిన్నంగా, రాష్ట్రంలో ఆస్తులు ఇద్దరు వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు గురువారం మండిపడ్డారు. ఇంకా వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూశారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతల పైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెసులో ఉన్నప్పుడు ఒకరీతిగా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరోరీతిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు.. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై గతంలో ఆయన చేసిన ప్రకటనలు చదివి వినిపించారు.

మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై టిడిపి సభ్యులు స్పందించారు. పార్టీలు మారడమనేది కేంద్ర, రాష్ట్రాల్లో సహజమేనని, కాంగ్రసులో దోపిడీని సహించలేక తాను ఆ పార్టీని వీడినట్లు గాలి ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును చూస్తే కాంగ్రెసు నేతలు ప్యాంట్లు తడుపుకుంటారని అన్నారు. గురువారం శాసన సభలో జరిగిన చర్చలో కాంగ్రెసు తరఫున ఆయన మాట్లాడారు.

English summary
Telugudesam Party senior MLA Gali Muddukrishnama Naidu on thursday lashed out at Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X